Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్లైట్‌లో సాంకేతిక లోపం : 3 గంటలుగా ఎయిర్‌పోర్టులో సచిన్!

ఫ్లైట్‌లో సాంకేతిక లోపం : 3 గంటలుగా ఎయిర్‌పోర్టులో సచిన్!
, శుక్రవారం, 25 జులై 2014 (17:15 IST)
భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ మూడు గంటలుగా హైదరాబాద్‌లోని డొమెస్టిక్ విమానాశ్రయంలో వేచివున్నాడు. తాను ప్రయాణించాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానం బయలుదేరడంలో తీవ్ర జాప్యం నెలకొంది. ఫలితంగా సచిన్ హైదరాబాద్‌ విమానాశ్రయంలో వెయిట్ చేస్తున్నాడు. సచిన్‌తో పాటు ఇతర ప్రయాణీకులు కూడా నిరీక్షిస్తున్నారు. 
 
కాగా అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ హైదరాబాదులో సందడి చేశారు. ఓ కార్యక్రమం నిమిత్తం సచిన్ హైదరాబాదుకు వచ్చారు. ఆయన ప్యారడైజ్ హోటల్‌లో ఫలహారం తిని, చాయ్ తాగారు. ప్యారడైజ్ హోటల్ నుండి సచిన్ బయటకు వస్తుండగా.. భారీగా అభిమానులు చేరి అతనితో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. సచిన్‌ను చూసేందుకు వచ్చిన అభిమానులతో ప్యారడైజ్ ప్రాంతం నిండిపోయింది. 

Share this Story:

Follow Webdunia telugu