Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్, కోహ్లీ బాటలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ!

సచిన్, కోహ్లీ బాటలో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ!
, మంగళవారం, 7 అక్టోబరు 2014 (10:37 IST)
క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ మాదిరిగానే టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఒక సాకర్ క్లబ్‌లో భాగస్వామిగా మారాడు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో పోటీపడనున్న చెన్నైయిన్ ఫుట్‌బాల్ క్లబ్‌లో సహభాగస్వామి అయ్యాడు. 
 
ఇప్పటికే ఈ క్లబ్‌లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ భాగస్వామి. తాజాగా ధోనీ ఒప్పందంపై సంతకం చేసినట్టు క్లబ్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. గోవా ఫుట్‌బాల్ క్లబ్‌లో విరాట్ కోహ్లీ, కేరళ బ్లాస్టర్స్ క్లబ్‌లో సచిన్ టెండూల్కర్, అట్లెటికోడి కోల్‌కతా క్లబ్‌లో సౌరవ్ గంగూలీ ఇప్పటికే భాగస్వాములయ్యారు. 
 
ఫుట్‌బాల్ క్లబ్‌లో వాటా తీసుకున్న క్రికెటర్ల జాబితాలో ఇప్పుడు ధోనీ కూడా చేరాడు. ఫుట్‌బాల్‌ను ఎంతో ఇష్టపడే అతను సమయం దొరికితే చాలు బంతిని తీసుకొని మైదానానికి పరుగులు తీస్తాడు. జట్టు ప్రాక్టీస్ సమయంలోనూ వ్యాయామానికి ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడతాడు. అదే ఇష్టంతో ఇప్పుడు సాకర్ ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu