భారత క్రికెట్ జట్టు కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఓకే కానీ, తన చాయిస్ మాత్రం సౌరవ్ గంగూలీనేనని భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు.
మిస్టర్ కూల్ ధోనీ సారథ్యంలో చానాళ్లు ఆడినప్పటికీ, భారత్కు ఎన్నో గొప్ప విజయాలు సాధించిపెట్టినప్పటికీ తన అభిమాన కెప్టెన్ మాత్రం కోల్కతా ప్రిన్స్ దాదానేనని చెప్పుకొచ్చాడు. అతని సారథ్యంలో ఆడడమంటే తనకెంతో ఇష్టమన్నాడు. అతని కెప్టెన్సీలోనే తాను వెలుగులోకి వచ్చానని, ఆ సమయంలోనే తన కెరీర్ అభివృద్ధి చెందిందని గుర్తు చేసుకున్నాడు.
అందుకే నా ఫేవరెట్ కెప్టెన్ గంగూలీనే. అతని నుంచి నేనెంతో నేర్చుకున్నాను. అతని కెప్టెన్సీలోనే నా కెరీర్ అభివృద్ధి చెందింది. మనం విదేశాల్లో కూడా సిరీస్లు నెగ్గగలమనే భావనను దాదా కలుగజేశాడని యువీ చెప్పుకొచ్చాడు. కాగా, ప్రాణాంతక కేన్సర్ కారణంగా ఏడాదిపాటు జట్టుకు దూరంగా గడపడం తన కెరీర్లో అత్యంత క్లిష్ట సమయమని అన్నాడు.