Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్న మహేళ జయవర్ధనే!

పాకిస్థాన్‌తో చివరి టెస్ట్ మ్యాచ్ ఆడనున్న మహేళ జయవర్ధనే!
, మంగళవారం, 12 ఆగస్టు 2014 (16:13 IST)
శ్రీలంక క్రికెట్ మూలస్తంభాల్లో ఒకడిగా పేరుగాంచిన మహేళ జయవర్ధనే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. గురువారం నుంచి పాకిస్థాన్‌తో ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ చివరి మ్యాచ్ కానుంది. 
 
ఇటీవలే టి20 వరల్డ్ టైటిల్ గెలిచిన అనంతరం మినీ ఫార్మాట్ కు వీడ్కోలు చెప్పిన ఈ మాజీ కెప్టెన్, తాజాగా టెస్టు బరి నుంచి తప్పుకోనుండడంతో లంక క్రికెట్ ఫ్యాన్స్ విచారంలో మునిగిపోయారు. వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి పూర్తిస్థాయిలో తప్పుకునే అవకాశాలున్నాయి. 
 
కాగా, ప్రపంచ క్రికెట్లో వన్డేలు, టెస్టుల్లో 11 వేలకు పైగా పరుగులు సాధించిన ఐదుగురు క్రికెటర్లలో మహేల ఒకడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర ఉన్నారు. ఇప్పటివరకు 148 టెస్టులాడిన మహేల 50.02 సగటుతో 11,756 పరుగులు చేశాడు. వాటిలో 34 సెంచరీలు, 49 అర్థసెంచరీలు ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu