Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264

టీమిండియా పరువు నిలబెట్టుకుంది: విండీస్ టార్గెట్ 264
, శనివారం, 11 అక్టోబరు 2014 (19:17 IST)
టీమిండియా పరువు నిలబెట్టుకుంది. తొలి వన్డే పరాభవాన్ని మైండ్‌లో పెట్టుకుని టీమిండియా క్రికెటర్లు జాగ్రత్తగా ఆడారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 263 పరుగులు సాధించింది. తద్వారా విండీస్‌కు 264 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.  
 
ఓపెనర్లు ధావన్, రహానే విఫలమవడంతో రాయుడు విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఒక దశలో రాయుడు అవుట్ కావడంతో పరుగుల వేగానికి బ్రేక్ పడింది. ఆ సమయంలో కోహ్లీ, రైనా జట్టును ఆదుకున్నారు. 
 
కోహ్లీ (62), రైనా (62) అర్థ శతకాలు సాధించి.. స్కోరును పరిగెత్తించారు. కెప్టెన్ కూడా అర్థ సెంచరీ సాధించడంతో భారత్ 50 ఓవర్లలో 263 పరుగులు సాధించింది. విండీస్ బౌలర్లలో టేలర్ 3 వికెట్లతో రాణించగా, రవి రాంపాల్, బెన్, బ్రావో, సమీ చెరోవికెట్ సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu