Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లంకతో ఐదు వన్డేల సిరీస్: మహ్మద్ షమీ అవుట్!

లంకతో ఐదు వన్డేల సిరీస్: మహ్మద్ షమీ అవుట్!
, సోమవారం, 27 అక్టోబరు 2014 (14:10 IST)
శ్రీలంకతో ఐదు వన్డేల సిరీస్ నుంచి టీమిండియా పేసర్ మహ్మద్ షమీ తప్పుకున్నాడు. గాయం కారణంగా అతని స్థానంలో ముంబై మీడియం పేసర్ ధవళ్ కులకర్ణిని ఎంపిక చేసినట్లు బీసీసీఐ తెలిపింది. 
 
షమీ కుడికాలి వేలి గాయంతో బాధపడుతున్నాడని, అతనికి పది రోజుల విశ్రాంతి అవసరమని డాక్టర్లు సూచించడంతో షమీని జట్టు నుంచి తొలగించినట్లు సమాచారం. 
 
కాగా, షమీ స్థానాన్ని భర్తీ చేస్తున్న కులకర్ణి ఈ ఏడాదే అంతర్జాతీయ వన్డే (ఇంగ్లండ్ పై) అరంగేట్రం చేశాడు. తాజాగా, దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చి సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.

Share this Story:

Follow Webdunia telugu