Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్-పాక్ సరిహద్దుల్లో రైనా: సైనికులతో కలిసి భోజనం!

భారత్-పాక్ సరిహద్దుల్లో రైనా: సైనికులతో కలిసి భోజనం!
, సోమవారం, 11 ఆగస్టు 2014 (13:27 IST)
భారత్-పాక్ సరిహద్దుల్లో సురేష్ రైనా హల్‌చల్ చేశారు. బార్డర్ వద్ద భారత సైనిక పోస్టును రైనా సందర్శించాడు. అంతేగాకుండా.. సైనికులతో కలిసి భోజనం కూడా చేశాడు. ఈ సందర్బంగా వారి పాకశాస్త్ర నైపుణ్యాన్ని మెచ్చుకున్నాడు. 
 
రైనా వారితో ముచ్చటిస్తూ, తన జీవితంలోని కొన్ని సంఘటనలను పంచుకోవడం విశేషం. నియంత్రణ రేఖ వద్ద భారత సైనిక పోస్టును రైనా సందర్శించాడని, ఆ పర్యటన ద్వారా భారత సైనికుల స్థైర్యం ఇనుమడిస్తుందని రక్షణ శాఖ ప్రతినిధి కల్నల్ ఎన్ఎన్ జోషి పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారత్ సైనికుల అప్రమత్తతను రైనా కొనియాడాడని తెలిపారు. 
 
కాగా, సురేశ్ రైనా కాశ్మీరీ పండిట్ల కుటుంబానికి చెందినవాడు. వీరిది కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లా. అయితే, రైనా కుటుంబం యూపీకి వలస వెళ్ళింది. రైనా స్వరాష్ట్రం జమ్మూకాశ్మీర్ కు రంజీల్లో ప్రాతినిధ్యం వహించలేదు.
 

Share this Story:

Follow Webdunia telugu