Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీమిండియా ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నా : కీర్తి ఆజాద్

టీమిండియా ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నా : కీర్తి ఆజాద్
, ఆదివారం, 17 ఆగస్టు 2014 (12:07 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్రంగా స్పందించారు. భారత క్రికెట్ జట్టు కనబరుస్తున్న ఆటతీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తాము దేశానికి ప్రాతినిథ్యం వహించిన సమయంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నామని, ప్రస్తుత జట్టు ప్రదర్శనకు సిగ్గుపడుతున్నానని అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన సౌరవ్ గంగూలీ సారథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ప్రపంచాన్ని ఏలిందని, ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మరపురాని విజయాలు సొంతం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. అలాంటి జట్టు ఇపుడు అత్యంత చెత్త ప్రదర్శనతో ముందుకు సాగడం సిగ్గుచేటుతో కూడుకున్న విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu