Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాథ్యూస్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!

మాథ్యూస్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!
, మంగళవారం, 24 జూన్ 2014 (10:16 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. కెప్టెన్ మాథ్యూస్ (160) అద్భుత సెంచరీకితోడు దమ్మిక ప్రసాద్ (4/15) మెరుపు బౌలింగ్ తొడవడంతో లంక విజయం దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు లంక రెండో ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటై.. 350 పరగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను దమ్మిక ప్రసాద్ చావుదెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులు వెనకబడ్డ లంక... ఇంగ్లండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి కుక్ సేన 26.2 ఓవర్లలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రూట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసాద్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, హెరాత్‌కు ఒక వికెట్ దక్కింది.
 

Share this Story:

Follow Webdunia telugu