Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!

రెండో టెస్టుకు సిద్ధమైన ధోనీ : కోహ్లీ బాటలో నడుస్తాం!
, మంగళవారం, 16 డిశెంబరు 2014 (16:12 IST)
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగే టెస్ట్ మ్యాచ్‌కు భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిద్ధమయ్యాడు. గాయం కారణంగా ఆసీస్తో తొలి టెస్టుకు దూరమైన ధోనీ.. బుధవారం నుంచి జరిగే రెండో టెస్టుకు జట్టుకు సారథ్యం వహించనున్నాడు. 
 
కోహ్లీ సారథ్యంలో బరిలోకి దిగిన భారత్ తొలి టెస్టులో ఓటమి చవిచూసినా పోరాటపటిమతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో భారత్ ఆటతీరును ధోనీ ప్రశంసించాడు. ఈ సిరీస్లో దూకుడైన క్రికెట్ ఆడుతామని ధోనీ చెప్పాడు. ముఖ్యంగా తొలి టెస్టులో విరాట్ కోహ్లీ చూపిన మార్గంలో నడుస్తామని ప్రకటించారు. 
 
మరోవైపు సిడ్నీ‌లో సాయుధ బందీల దుశ్చర్యలతో సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు భారీ భద్రత కల్పించారు. స్టేడియం లోపల, వెలుపల పెద్ద ఎత్తున బలగాలను మోహరించినట్టు అధికారులు చెప్పారు. ఆగంతకుడు సిడ్నీలోని ఓ కేఫ్లో బందీలుగా నిర్బంధించిన సంగతి తెలిసిందే. కమెండో ఆపరేషన్ చేపట్టి బందీలు రక్షించారు. 

Share this Story:

Follow Webdunia telugu