భారత ఓపెనర్ రోహిత్ శర్మ పట్ల అనుచితంగా ప్రవర్తించిన డేవిడ్ వార్నర్కు జరిమానా విధించారు. అంతేగాకుండా దురుసు ప్రవర్తన మానుకోవాలని, మరోసారి ఇలా వ్యవహరించకూడదంటూ క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూ టీవ్ జేమ్స్ సదర్లాండ్ వార్నర్ను హెచ్చరించారు.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ సందర్భంగా రోహిత్పై వార్నర్ నోరు పారేసుకున్నాడు.
రోహిత్-రైనా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓవర్ త్రోకు వీరిద్దరూ పరుగు తీశారు. ఆ సమయంలో రోహిత్, వార్నర్ మధ్య వాగ్వాదం జరిగింది. వార్నర్ తాను తప్పు చేసినట్లు అంగీకరించాడు. అతనికి మ్యాచ్ ఫీజులో సగం జరిమానా విధించడం జరిగింది.