Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సౌతాంఫ్టన్ టెస్ట్ : బ్యాలెన్స్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఇంగ్లండ్

సౌతాంఫ్టన్ టెస్ట్ : బ్యాలెన్స్ సెంచరీ.. పటిష్ట స్థితిలో ఇంగ్లండ్
, సోమవారం, 28 జులై 2014 (10:13 IST)
సౌతాంప్టన్ వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు పటిష్ట స్థితిలో ఉంది. ఆ జట్టు కెప్టెన్ కుక్ (95), మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బ్యాలెన్స్ (104 నాటౌట్) సెంచరీతో రాణించడంతో ఇంగ్లండ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 
 
వరుసగా బ్యాటింగ్ వైఫల్యాలతో సతమతమవుతున్న ఇంగ్లండ్ కెప్టెన్ కుక్ ఈ మ్యాచ్‌తో సత్తా చాటాడు. 95 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 55 పరుగుల వద్ద ఓపెనర్ రాబ్సన్ (26) ఔటైనప్పటికీ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ తడబడకుండా స్కోరు పెంచారు. అనంతరం బ్యాలెన్స్ (104 నాటౌట్), బెల్ (16 నాటౌట్) సమయోచితంగా ఆడి మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. భారత బౌలర్లలో జడేజా, షమీలకు చెరో వికెట్ దక్కింది. 

Share this Story:

Follow Webdunia telugu