Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిస్బేన్ టెస్టు: బౌలర్లదే హవా.. భారత్ 408 ఆలౌట్.. ఆస్ట్రేలియా 221

బ్రిస్బేన్ టెస్టు: బౌలర్లదే హవా.. భారత్ 408 ఆలౌట్.. ఆస్ట్రేలియా 221
, గురువారం, 18 డిశెంబరు 2014 (15:10 IST)
బ్రిస్బేన్‌లో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు సత్తా చాటారు. రెండో రోజు ఆటలో ఆస్ట్రేలియా కూడా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నాలుగు వికెట్లు కోల్పోయి 311 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న టీమిండియా 408 పరుగులకే పరిమితమైంది. అయితే అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ 52 ఓవర్లు మాత్రమే ఆడి నాలుగు వికెట్లను చేజార్చుకుంది.
 
తొలి రోజు బ్యాట్స్‌మెన్‌ల హవా కొనసాగినా.. రెండో రోజు ఆటలో మాత్రం బౌలర్లు చెలరేగిపోయారు. ఈ రోజు ఆటలో మొత్తం మీద 10 వికెట్లు నేలరాలడం విశేషం. రెండో రోజు తన తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఆసీస్ స్వల్వ వ్యవధిలో కీలక వికెట్లను కోల్పోయింది.
 
ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్ డేవిడ్ వార్నర్(29)పరుగులు చేసి తొలి వికెట్ రూపంలో వెనుదిరగగా, అతని స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన షేన్ వాట్సన్ (25) పరుగులు మాత్రమే పెవిలియన్ చేరాడు. తరువాత ఆసీస్‌ను రోజర్స్ (55), కెప్టెన్ స్టీవెన్ స్మిత్(65*) పరుగులతో ఆదుకున్నారు.
 
ప్రస్తుతం 221 పరుగులకు నాలుగు వికెట్ల కోల్పోయిన ఆసీస్.. టీమిండియా తొలి ఇన్నింగ్స్ కంటే 187 పరుగుల వెనకబడి ఉంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌ మూడు వికెట్లు సొంతం చేసుకోగా, అశ్విన్ ఒక వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu