Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!

శ్రీలంకతో వన్డే సిరీస్ వేదికలు - టీమిండియా ఖరారు : ధోనీకి రెస్ట్!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (14:27 IST)
వెస్టిండీస్ పర్యటన అర్థాంతరంగా ముగియడంతో దాని స్థానంలో శ్రీలంక క్రికెట్ జట్టు భారత్‌లో పర్యటించనుంది. ఇందుకోసం వేదికలతోపాటు.. జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) మంగళవారం ఖరారు చేసింది. ఆ ప్రకారంగా లంకతో జరిగే వన్డే సిరీస్‌‌లో భాగంగా తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్ ధోనీకి ఈ మూడు మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించారు. 
 
ఈ మ్యాచ్‌లకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. తొలి మూడు వన్డేలకు ఎంపికైన ఆటగాళ్లు వీరే... కోహ్లీ (కెప్టెన్), ధావన్, రహానే, సురేష్ రైనా, అంబటి రాయుడు, సాహా, అశ్విన్, జడేజా, షమీ, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు.
 
అలాగే, శ్రీలంకతో జరిగే మ్యాచ్‌ల కోసం వేదికలను కూడా ఖరారు చేసింది. ఆ ప్రకారంగా కటక్, హైదరాబాద్, రాంచీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో వన్డే మ్యాచ్‌లను నిర్వహిస్తారు 

Share this Story:

Follow Webdunia telugu