Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌: ఆసీస్ విజయలక్ష్యం 128.. భారత్‌కు మరో ఓటమి ఖాయం!

బ్రిస్బేన్ టెస్ట్ మ్యాచ్‌: ఆసీస్ విజయలక్ష్యం 128.. భారత్‌కు మరో ఓటమి ఖాయం!
, శనివారం, 20 డిశెంబరు 2014 (11:12 IST)
ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టు మరో ఓటమిని చవిచూడనుంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా బ్రిస్బేన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్సులో భారత్ 224 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, భారత్ ఆధిక్యం 127 పరుగులు కాగా, ఆస్ట్రేలియా కేవలం 128 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. 
 
ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయిన టీమిండియా మరో ఓటమి ముంగిట ఉన్నట్టే. మన బౌలర్లు అద్భుతం చేస్తే తప్ప ఓటమి నుంచి బయట పడలేరు! భారత్ రెండో ఇన్నింగ్సులో ధావన్ 81 పరుగులు చేయగా, ఐదుగురు ఆటగాళ్లు రెండంకెల స్కోర్‌ను కూడా చేరుకోలేకపోవడం గమనార్హం. రోహిత్ శర్మ, ధోనీ డకౌట్ అయ్యారు.
 
ఆ తర్వాత స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి తిగిన ఆస్ట్రేలియాకు భారత బౌలర్ ఇషాంత్ శర్మ ఆరంభంలోనే షాకిచ్చాడు. ప్రమాదకర ఓపెనర్ వార్నర్ (6)ను తొలుత బలిగొన్న ఇషాంత్, ఆ తర్వాత వచ్చిన షేన్ వాట్సన్‌ను డకౌట్ చేశాడు. దీంతో, ఆసీస్ 22 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆసీస్ స్కోరు 2 వికెట్లకు 44 పరుగులు కాగా, క్రీజులో ఓపెనర్ రోజర్స్ (26*), కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (8*) ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu