Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అనుష్క శర్మపై కోహ్లీ మనస్సు లగ్నం... ఇంగ్లండ్‌లో చెత్త ప్రదర్శన!!

అనుష్క శర్మపై కోహ్లీ మనస్సు లగ్నం... ఇంగ్లండ్‌లో చెత్త ప్రదర్శన!!
, ఆదివారం, 20 జులై 2014 (10:38 IST)
భారత క్రికెట్ జట్టు భవిష్యత్ కెప్టెన్‌గా భావిస్తున్న విరాట్ కోహ్లీ మనసంతా తన ప్రేయసి అనుష్క శర్మపై కేంద్రీకృతమైవున్నట్టు తెలుస్తోంది. అందుకే ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టులో సభ్యుడైన కోహ్లీ.. తన కెరీర్‌లో అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రత్యేక అనుమతిపై అనుష్కను ఇంగ్లండ్‌కు పంపిన.. కోహ్లీతో గడిపేందుకు బీసీసీఐ అనుమతిచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
ప్రస్తుత ఇంగ్లండ్ టూర్‌లో విరాట్‌పై భారత అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఈ ఢిల్లీ స్టార్ బ్యాట్స్‌మెన్ మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇప్పటికి మూడు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ... ఒక ఇన్నింగ్స్‌లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. తొలిటెస్టులో 1, 8 పరుగులు... రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్ (0) ఇదీ కోహ్లీ ప్రదర్శన. 
 
అయితే కోహ్లీ వైఫల్యానికి బాలీవుడ్ భామ అనుష్క శర్మే కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు లండన్‌లోనే ఉందట. టీమిండియా బస చేసిన హోటల్లోనే మకాం వేసిందట. ఆట అయిపోవడం ఆలస్యం మన హీరో తన ప్రియురాలు ముందు వాలిపోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల్లో గ్రౌండ్‌లో మనోడు బ్యాంటింగ్ ఏం చేస్తాడులే అని తోటి క్రికెటర్లే గుసగుసలు పోతున్నారట. 
 
గతంలో కూడా టీమిండియా న్యూజిలాండ్ పర్యటనలో ఉన్నప్పుడు అనుష్క పనిగట్టుకుని అక్కడకు వెళ్లింది. ఒకానొక సమయంలో అనుష్క షూటింగ్ కోసం శ్రీలంకలో ఉండగా... కోహ్లీ రెక్కలు కట్టుకుని అక్కడ వాలిపోయాడు. వీళ్లు పీకల్లోతు ప్రేమలో మునిగినంత మాత్రాన మనకొచ్చిన సమస్యేమీ లేదు... అయితే, వీరి రొమాన్స్ మన జట్టు విజయావకాశాలపై ప్రభావం చూపుతుండటమే ట్విస్ట్. ఇకనైనా కోహ్లీ 'అసలైన బ్యాటింగ్'పై దృష్టి సారిస్తే టీమిండియాకు బెస్ట్. 

Share this Story:

Follow Webdunia telugu