Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆటగాళ్ళకు ఆహారంలో చిక్కులు.. అందుకే ఓటమి : ధోనీ

ఆటగాళ్ళకు ఆహారంలో చిక్కులు.. అందుకే ఓటమి : ధోనీ
, ఆదివారం, 21 డిశెంబరు 2014 (12:19 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోవడానికి టీమిండియా క్రికెటర్లకు ఆహారం విషయంలో అనేక చిక్కులు ఎదురవుతున్నట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ చెపుతున్నాడు. ఈ చికాకుతో పాటు ఆసీస్ పిచ్‌లు అనూహ్యంగా స్పందిస్తున్నాయని అందువల్లే రాణించలేక పోతున్నట్టు ధోనీ చెప్పుకొచ్చాడు. 
 
బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ ఓటమిపై ధోనీ స్పందిస్తూ బ్రిస్బేన్ టెస్ట్ తొలి సెషన్‌ ప్రారంభానికి ముందు డ్రెస్సింగ్‌ రూమ్‌లో నెలకొన్న గందరగోళం నాలుగో రోజు భారత ఆటతీరుపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కీలకమైన తొలి సెషన్‌లో తడబాటే ఓటమికి ప్రధాన కారణమన్నాడు. 
 
ఓ మంచి భాగస్వామ్యం, మరికొన్ని పరుగులు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. మొత్తంమీద నాలుగో రోజు టీమిండియాకు ఏదీ కలసిరాలేదని చెప్పుకొచ్చాడు. ఐదో రోజు వరకు ఆటసాగి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగేదన్నారు. అయితే, పిచ్‌ అనూహ్యంగా స్పందించడం, ఆటగాళ్ల ఆహార విషయంలో ఎదురైన పరిణామాలు జట్టును చికాకుపరిచాయని చెప్పాడు. 

Share this Story:

Follow Webdunia telugu