Webdunia - Bharat's app for daily news and videos

Install App

2013 వరకు ఐపీఎల్ ఛైర్మన్ మోడీనే : శశాంక్

Webdunia
రాజస్థాన్ క్రికెట్ సంఘం అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి గురైన లలిత్ మోడీ... 2013 వరకు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కమిషనర్‌గా కొనసాగుతారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ స్పష్టం చేశాడు. రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల ఫలితాల ప్రభావం ఆయన బీసీసీఐ పదవులపై ఉండదని ఆయన ప్రకటించాడు.

కాగా, మోడీ ఐపీఎల్ కమీషనర్‌గానే కాకుండా, బీసీసీఐ ఉపాధ్యక్షుడిగానూ కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ విషయమై శశాంక్ మాట్లాడుతూ... ఈ రెండు పదవులకు.. తాజా ఎన్నికల ఫలితాలకూ ఎలాంటి సంబంధమూ లేదని వివరించాడు. ఆదివారం జరిగిన రాజస్థాన్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో ఐఏఎస్ అధికారి సంజయ్ దీక్షిత్ చేతిలో మోడీ 18-13 ఓట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే... బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా మోడీ 2008లో ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మరో మూడేళ్లపాటు కొనసాగుతారు. అలాగే, ఐపీఎల్ కమిషనర్‌గా కూడా ఆయన పదవీకాలం 2013 వరకు ఉంది. ఈ మేరకు శశాంక్ మాట్లాడుతూ... ఇకపై కూడా లలిత్ మోడీ బీసీసీఐ అన్ని సమావేశాలకు హాజరవుతారనీ, అయితే రాజస్థాన్ క్రికెట్ సంఘానికి మాత్రం ఆయన ప్రాతినిధ్యం ఉండబోదని తెలియజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

Show comments