Webdunia - Bharat's app for daily news and videos

Install App

2011 ప్రపంచకప్ ప్రణాళికపై 40 గంటల్లో సమీక్ష

Webdunia
శ్రీలంక క్రికెట్ జట్టుపై మంగళవారం లాహోర్‌లో ఉగ్రవాద దాడి జరిగిన నేపథ్యంలో.. భారత ఉపఖండంలో జరగాల్సిన 2011 ప్రపంచకప్‌‌పై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. శ్రీలంక క్రికెటర్లను లక్ష్యంగా చేసుకొని లాహోర్‌లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద దాడిలో ఆరుగురు శ్రీలంక క్రికెటర్లకు స్వల్పగాయాలయ్యాయి.

ఈ దాడిలో వారికి రక్షణగా ఉన్న ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. తాజా పరిణామాల ప్రభావం భారత ఉపఖండంలో జరగాల్సిన ప్రపంచకప్‌పై కూడా పడింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2011 ప్రపంచకప్ ప్రణాళికలపై రాబోయే 48 గంటల్లో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది.

శ్రీలంక క్రికెట్ జట్టుపై జరిగిన దాడిని ఐసీసీ ఖండించింది. మొత్తం క్రికెట్ కుటుంబానికే ఇది విచారకరమని వ్యాఖ్యానించింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రహూన్ లోర్గాత్ వచ్చే ప్రపంచకప్ ప్రణాళికలను సమీక్షించేందుకు ఐసీసీ సమావేశం అవుతుందని తెలిపారు. దీనిపై రాబోయే 48 గంటల్లో నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళా ఉద్యోగిని అలా వేధించిన డీసీపీఓ ఆఫీసర్.. ఇంటికెళ్తే ఆఫీసుకు రమ్మంటాడు...

Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

Sonu Sood: పామును చేతిలో పట్టుకున్న సోనూసూద్.. ఎందుకో తెలుసా? (video)

Heavy Rains: హైదరాబాదులో భారీ వర్షాలు.. ఏం భయం లేదంటున్న సర్కార్

Pawan Kalyan: సెప్టెంబర్ నుంచి పార్టీ నిర్మాణంపై పవన్ కల్యాణ్ ఫోకస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

Show comments