Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో హోండా వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం

హీరో హోండా వన్డే సిరీస్ ఆస్ట్రేలియా కైవసం
, ఆదివారం, 8 నవంబరు 2009 (16:52 IST)
అనుకున్నట్టుగానే జరిగింది. స్వదేశంలో జరిగిన ఏడు మ్యాచ్‌లో హీరోహోండా వన్డే సిరీస్‌ను పర్యాటక ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. ఆదివారం అస్సోం రాష్ట్ర రాజధాని గౌహతిలో జరిగిన ఆరో మ్యాచ్‌లో ఆసీస్ జట్టు భారత్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఏడు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-2 తేడాతో కైవసం చేసుకుంది.

ఈనెల 11వ తేదీన ముంబైలో జరుగనున్న చివరి మ్యాచ్ నామమాత్రంగా మిగిలింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి భారత్ బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఒక దశలో వంద పరుగులకే ఆలౌట్ అయ్యే సూచనలు కనిపించాయి.

అయితే, ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచిన రవీంద్ర జడేజా (56), ప్రవీణ్ కుమార్ (54 నాటౌట్) పుణ్యమాని 48 ఓవర్లలో 170 పరుగుల వద్ద ధోనీ సేన ఆలౌట్ అయింది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 41.5 ఓవర్లలో 172 పరుగులు సాధించి విజయకేతనం ఎగురవేసింది. ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ వెన్నువిరిచిన ఆసీస్ పేసర్ బోలింగర్‌‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

Share this Story:

Follow Webdunia telugu