Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సఫారీల గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమే..!: శ్రీశాంత్ వ్యాఖ్య

సఫారీల గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమే..!: శ్రీశాంత్ వ్యాఖ్య
FILE
సఫారీల గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్ నెగ్గడం సాధ్యమేనని భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్ సేన తప్పకుండా దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై మట్టికరిపించి, సిరీస్‌ను సొంతం చేసుకుంటుందని శ్రీశాంత్ ఆశించాడు.

ప్రస్తుతం తన బౌలింగ్ విధానం ముందుకంటే చాలా మెరుగైందని శ్రీశాంత్ అన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కష్టతరమైన పిచ్‌లకు అనుగుణంగా బంతులేయడం భారత బౌలర్లకు సాధ్యమేనని అన్నాడు.

దక్షిణాఫ్రికా పిచ్‌లు భారత ఆటగాళ్లకు అనుకూలించవని వచ్చే వార్తలను శ్రీశాంత్ కొట్టిపారేశాడు. ఈసారి తప్పకుండా దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పు వస్తుందని, పిచ్‌లు కూడా అనుకూలిస్తాయని శ్రీశాంత్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu