Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీలంక టెస్టు జట్టు: వైస్ కెప్టెన్‌గా ముత్తయ్య మురళీధరన్!

శ్రీలంక టెస్టు జట్టు: వైస్ కెప్టెన్‌గా ముత్తయ్య మురళీధరన్!
FILE
భారత్-శ్రీలంకల మధ్య జరిగే మూడు టెస్టుల సిరీస్‌లో ఆడే లంకేయుల జట్టును ఆ దేశ సెలక్షన్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో శ్రీలంక వైవిధ్య పేస్ బౌలర్ లసిత్ మలింగకు చోటు దక్కింది. అలాగే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్న ముత్తయ్య మురళీధరన్‌ను సెలక్టర్లు వైస్ కెప్టెన్‌గా నియమించారు.

ఈ నెల 18 నుంచి భారత్‌ - శ్రీలంక టెస్ట్‌ ప్రారంభం కానున్న ఈ టెస్ట్‌ సిరీస్‌లో ఆడే లంక జట్టులో స్పిన్నర్‌ అజంతా మెండిస్‌కు చోటు దక్కలేదు. గాలెలో ఇంగ్లాండ్‌తో 2007లో జరిగిన టెస్ట్‌లో మలింగ తన అంతర్జాతీయ కెరీర్‌లో ఆఖరి టెస్ట్‌ ఆడాడు. ఆ కాలంలో మలింగ మోకాలి గాయమై దాదాపు 9 నెలలు క్రికెట్‌కు దూరమవడం గమనార్హం.

అలాగే శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపెక్సే వ్యక్తిగత వైద్యుడు ఎలియాన్త్‌ వైట్‌ ఈ క్రికెటర్‌కు చికిత్స చేశాడు. అప్పటి నుంచి వన్డేలు, ట్వంటీలకు మాత్రమే మలింగ ప్రాతినిధ్యం ఇచ్చాడు. టెస్టుల్లో సుదీర్ఘ స్పెల్‌ బౌలింగ్‌ చేయవలసి ఉండటం వల్లే శ్రీలంక ఫిజియో ఇప్పటి వరకు మలింగను టెస్ట్‌లో సిఫార్సు చేయలేదని తెలిసింది.

Share this Story:

Follow Webdunia telugu