Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్డే ప్రపంచకప్: బెంగళూరులో టీమిండియా ప్రాక్టీస్!

వన్డే ప్రపంచకప్: బెంగళూరులో టీమిండియా ప్రాక్టీస్!
FILE
వన్డే ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టు బెంగళూరులో ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ, కర్ణాటక క్రికెట్ సంఘాలకు చెందిన గ్రౌండ్స్‌లో ధోనీసేన ప్రాక్టీస్‌కు రెడీ అయ్యింది. అలాగే బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయనున్నారు.

ప్రాక్టీస్ కోసం మంగళవారం రాత్రికే టీమిండియా బెంగళూరు చేరుకుంది. ఇంకా బుధవారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు నేషనల్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇదే స్టేడియంలో గాయంతో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నుంచి వెనుదిరిగిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లకు ఫిట్‌నెస్ పరీక్ష జరుగనుంది.

దక్షిణాఫ్రికా సిరీస్‌కు అనంతరం 20రోజులు విశ్రాంతి తీసుకున్న కోచ్ కిర్‌స్టన్ భారత ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరు చేరుకున్నారు. కాగా, ఫిబ్రవరి 13వ తేదీ భారత్-ఆస్ట్రేలియాల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్‌ జరుగనుంది.

అలాగే ఫిబ్రవరి 15న న్యూజిలాండ్‌తో చెన్నై చేపాక్కం స్టేడియంలో భారత్ మరో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లను పూర్తి చేసుకుని వన్డే ఢాకాలో జరిగే ప్రపంచకప్ ప్రారంభోత్సవాలకు టీమిండియా బయలుదేరుతుంది.

Share this Story:

Follow Webdunia telugu