వన్డే ప్రపంచకప్లో తన సత్తా ఏంటో నిరూపించుకుంటానని యువ స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వచ్చినా, శక్తివంచ లేకుండా తన వంతు పాత్రను పోషించానని చావ్లా వ్యాఖ్యానించాడు.
ఈసారి వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి ఎంపికైన 15 మంది సభ్యులతో కూడిన టీమిండియా జట్టులో తన చేరిక ఆషామాషీగా వచ్చిపడింది కాదని చావ్లా స్పష్టం చేశాడు. తనను తాను చాలా సందర్భాల్లో నిరూపించుకున్నానని తెలిపాడు.
ఇకపోతే.. వన్డే ప్రపంచకప్ జట్టు స్పిన్ విభాగంలో హర్భజన్ సింగ్, రామచంద్రన్ అశ్విన్లతోపాటు చావ్లా కూడా ఉన్నాడు. అయితే, 2008 నుంచి ఇప్పటివరకూ అతనికి కేవలం రెండంటే రెండు వన్డేల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది.
వాస్తవానికి చావ్లా కంటే మరో యువ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా నిలకడగా రాణిస్తున్నాడు. అతనినే వరల్డ్ కప్ పోటీలకు ఎంపిక చేస్తారని అంతా ఊహించారు. కానీ, ఓఝాను పక్కకు పెట్టిన సెలక్షన్ కమిటీ అనూహ్యంగా చావ్లాను ఎంపిక చేసింది.