భారత బౌలర్ల ధాటికి ఏడు వికెట్లు కోల్పోయిన కివీస్!
వడోదరా మూడో వన్డే మ్యాచ్లో భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు బెంబెలెత్తిపోయారు. జహీర్ ఖాన్, యూసుఫ్ పఠాన్లు విజృంభించడంతో కివీస్ 115 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కివీస్కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 49 పరుగులకే న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ గుప్తిల్ (12), మెక్ కల్లమ్ (0), విలియమ్సన్ (21), టైలర్ (4)లు జహీర్ ఖాన్, పటేల్ బౌలింగ్ వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఇదే తరహాలో స్టైరిస్ (22), వెట్టోరి (3), హోప్కిన్స్ (6)లు కూడా అశ్విన్, యూసుఫ్ పఠాన్లకు వికెట్లు సమర్పించుకున్నారు. ప్రస్తుతం ఫ్రాంక్లిన్ (42), నాథన్ మెక్ కల్లమ్ (27)లు క్రీజులో ఉన్నారు. దీంతో 42 ఓవర్లలో కివీస్ ఏడు వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, యూసుఫ్ పఠాన్లు చెరో రెండేసి వికెట్లు పడగొట్టగా, పటేల్, అశ్విన్లు చెరో వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు.