Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ - శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్ : విరాట్ కోహ్లీ

భారత్ - శ్రీలంక ఫైనల్ మ్యాచ్‌కు ధోనీ కెప్టెన్ : విరాట్ కోహ్లీ
, బుధవారం, 10 జులై 2013 (13:41 IST)
File
FILE
వెస్టిండీస్ గడ్డపై గురువారం భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహిస్తాడని భారత క్రికెట్ జట్టు తాత్కాలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించారు. శ్రీలంకపై విజయం సమష్టి విజయంగా అభివర్ణించాడు.

చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టుపై భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఈ మ్యాచ్ ఫలితంపై విరాట్ కోహ్లీ స్పందిస్తూ... జట్టులోని ఆటగాళ్ల ప్రతిభను చూసి గర్విస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.

ప్రారంభ మ్యాచ్‌లలో ఓడినా.. తర్వాతి మ్యాచ్‌లలో ఘన విజయాలు భారత జట్టు సత్తాకు నిదర్శనమన్నాడు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ ధోనీ సారథ్య బాధ్యతలను నిర్వహిస్తాడని కోహ్లీ చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu