Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"బ్లేజర్"ను మరిచి భారత్ చేరిన అలిస్టర్ కుక్!

FILE
మతిమరుపుతో ఇంగ్లండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ బ్లేజర్‌ను మరిచిపోయాడు. వామప్ మ్యాచ్‌లు ముగిసిన తర్వాత, అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తె చార్లొట్‌ను చూసేందుకు కుక్ స్వదేశానికి వెళ్లాడు. అయితే తిరిగి వచ్చే సమయంలో బ్లేజర్‌ను మరిచిపోయాడు. టాస్ వేసేందుకు వెళ్లినప్పుడు నీలం రంగుగల ఆ కోటును అతను వేసుకోవాలి.

భారత్ చేరుకున్న వెంటనే బ్లేజర్‌ను మరిచిపోయినట్టు గ్రహించిన కుక్ దానిని తీసుకురావాల్సిందిగా అప్పటికి ఇంకా బయలుదేరని స్పిన్నర్ గ్రేమ్ స్వాన్‌కు మెసేజ్ పెట్టాడు.

కానీ స్వాన్ ఫోన్‌లో మెసేజ్‌ను చూడకుండానే ఇంగ్లండ్ నుంచి బయలుదేరి వచ్చేశాడు. దీంతో కుక్ వెంటనే తన స్నేహితుడికి ఫోన్ చేసి బ్లేజర్‌ను అహ్మదాబాద్ తీసుకురావాల్సిందిగా కోరాడు. ఇలా మరచిపోవడం క్రికెటర్లకు సహజమేనని, తాను యుఎఇలో పర్యటనకు వెళ్లినప్పుడు క్రికెట్ కిట్‌ను మరచిపోయానని స్వాన్ అంటున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu