Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రెజెంటేషన్ వేడుకలో పటౌడీని మరచిన నిర్వాహకులు

ప్రెజెంటేషన్ వేడుకలో పటౌడీని మరచిన నిర్వాహకులు
ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మాజీ భారత కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీని విస్మరించింది. సిరీస్ ముగిసిన అనంతరం జరిగిన ప్రెజెంటేషన్ వేడుకలో నిర్వాహకులు విజేతలకిచ్చే పటౌడీ ట్రోఫీ స్థానంలో స్పాన్సర్స్ ట్రోఫీని ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌కు అధికారికంగా అప్పగించారు.

ప్రెజెంటేషన్ వేడుక వేదిక మీద ఆ సమయంలో నవాబ్ పటౌడీతో పాటు ఈసీబీ ఛైర్మన్ గైల్స్ క్లార్క్, స్పాన్నర్స్ ప్రతినిధులు కూడా ఉండటం విశేషం. అయితే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ అథర్టన్ పటౌడీని పూర్తిగా విస్మరించి పటౌడీ ట్రోఫీ కాకుండా ఎన్‌పవర్ ట్రోపీని స్ట్రాస్‌కి అందించాడు. తాము స్ట్రాస్‌కు ఇచ్చినది పటౌడీ ట్రోఫీ కాదని నిర్వాహకులు తెలసుకొనే సమయానికి ప్రెజెంటేషన్ వేడుక ముగిసింది. నిర్వాహకులు చేసిన చర్యను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తప్పుబట్టాడు.

Share this Story:

Follow Webdunia telugu