Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పద్మశ్రీ అవార్డును అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ!

పద్మశ్రీ అవార్డును అందుకున్న మహేంద్ర సింగ్ ధోనీ!
FILE
టీమ్ ఇండియా కెప్టెన్, జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ ఈ అవార్డును ధోనీకి అందజేశారు.

వాస్తవానికి ఈ ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ఈ అవార్డును ధోనీ తీసుకోవాల్సి ఉండగా, ఆ కార్యక్రమానికి ధోనీ హాజరు కాలేదు. అభిమానుల హృదయాలను గాయపరిచాడంటూ.. దీనిపై పెద్ద దుమారం కూడా రేగింది.

ఇంకా బీహార్ కోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ వ్యవహారంపై స్పందించిన కోర్టు వివరణ కోరుతూ.. గత మాసం ధోనీకి నోటీసులు కూడా పంపిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మంగళవారం జార్ఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివ్ బసంత్ చేతుల మీదుగా స్వీకరించాడు. ఈ సందర్భంగా ధోనీ మాట్లాడుతూ.. ఈ పురస్కారాన్ని అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu