ఇంగ్లండ్తో లీడ్స్లో జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్లో ఆస్ట్రేలియా అనూహ్య విజయం సాధించిందని ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ తెలిపాడు. ఇంగ్లండ్పై ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ విజయంతో ఆస్ట్రేలియా యాషెస్ సిరీస్ను 1-1తో సమం చేసింది.
ఈ నేపథ్యంలో పాంటింగ్ మాట్లాడుతూ.. కొత్త బంతితో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ను నేలకూల్చగలిగితే ప్రత్యర్థులను దెబ్బతీయొచ్చు. తాము ఇదే పనిని రెండుసార్లు చేశాము. దీంతో తమ పని అనుకున్నదాని కంటే చాలా సులభమైంది. ఈ మ్యాచ్ పూర్తిగా అనూహ్యంగా మారిపోయిందని పాంటింగ్ తెలిపాడు. సిరీస్లో మిగిలిన నిర్ణయాత్మక ఐదో టెస్ట్ ఒవల్లో జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 20న ప్రారంభం కానుంది.