Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తప్పు చేశామన్న ధోనీ: కలిస్ కోసమే గెలిచామన్న స్మిత్!

తప్పు చేశామన్న ధోనీ: కలిస్ కోసమే గెలిచామన్న స్మిత్!
FILE
దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 1-0తో కోల్పోవడం వెనక తమ జట్టు బ్యాటింగ్ వైఫల్యం తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని కెప్టెన్ ధోనీ తెలిపాడు. భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల ధోనీ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

కింగ్స్‌మీడ్ మైదానంలో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడాడు. ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో. 62/2 స్కోరుతో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగుతున్న సమయంలో భారత ఆటగాళ్లు రాణించివుంటే మ్యాచ్ డ్రాగా ముగిసేదని తెలిపాడు. అయితే కేవలం 86 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయామని చెప్పాడు.

223 అలౌట్ అయిన భారత జట్టు 57 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది. లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికా 1-0తో టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. అత్యంత కీలకమైన చివరి రోజు మొదటి సెషన్‌లో తడబడటం కారణంగా మ్యాచ్ చేజారిందని మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు

మరోవైపు తమ జట్టు స్టార్ ప్లేయర్ జాక్వెస్ కలిస్‌కు చివరి అంతర్జాతీయ టెస్టు సిరీస్ కావడంతో భారత్‌తో జరిగిన రెండో టెస్టును ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఆడామని దక్షిణాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ తెలిపాడు.

Share this Story:

Follow Webdunia telugu