దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గాయపడిన పేసర్ డరెల్ టఫీ స్థానంలో ఓబ్రియాన్ను అనుమతిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలికి చెందిన టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది.
గాయం కారణంగా జట్టుకు దూరమైన డరెల్ టఫీ స్థానాన్ని ఓబ్రియాన్తో భర్తీ చేసుకునేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుకు అనుమతి ఇస్తున్నట్టు ఐసీసీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇదే విషయాన్ని కివీస్ క్రికెట్ బోర్డు కూడా స్పష్టం చేసింది. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా శనివారం జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్లో కివీస్ జట్టు పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ టోర్నీలో కివీస్ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న విషయం తెల్సిందే.