Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జట్టును గెలిపించడమే నా లక్ష్యం: వీవీఎస్ లక్ష్మణ్

జట్టును గెలిపించడమే నా లక్ష్యం: వీవీఎస్ లక్ష్మణ్
FILE
తన కంటూ ప్రత్యేకించి లక్ష్యాలంటూ లేవని, జట్టును గెలిపించడమే తన ప్రధాన కర్తవ్యమని ఆపద్భాంధవుడు, హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడాన్ని ఇష్టపడతానని లక్ష్మణ్ వెల్లడించాడు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌ను టీమ్ ఇండియా ఛాలెంజింగ్‌గా తీసుకుంటుందని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టు పటిష్టంగా ఉంది. స్టెయిన్, మోర్కెల్‌ల ఫాస్ట్ బౌలింగ్, కల్లీస్ ఆల్‌రౌండర్‌గా రాణించడం భారత్‌కు బలపరీక్షేనని లక్ష్మణ్ చెప్పాడు. కానీ ఇటీవల కాలంలో భారత్ విదేశీ గడ్డపై అద్భుతంగా రాణిస్తోంది. ఇదే తీరు దక్షిణాఫ్రికాలోనూ కొనసాగుతుందని నమ్ముతున్నానని లక్ష్మణ్ అన్నాడు.

భారత్ బౌలింగ్‌కు అనుకూలించని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు పనికివస్తాయని లక్ష్మణ్ తెలిపాడు. తమ జట్టులో అద్భుతంగా రాణించే బౌలర్లు ఉన్నారని వీవీఎస్ గుర్తు చేశాడు. కానీ టీమ్ ఇండియాలోని ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్ ఆడితే తప్పకుండా దక్షిణాఫ్రికా గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమేనని వీవీఎస్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగుల ఆధిక్యం సాధించాలని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

Share this Story:

Follow Webdunia telugu