Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సవరణ

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ సవరణ
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సవరించింది. దక్షిణాఫ్రికాలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీని ముందుగా సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 5వరకు జరపాలని ఐసీసీ నిర్ణయించింది.

అయితే ఈ టోర్నీని రెండు రోజుల ముందే (22వ తేదీ నుంచి) ప్రారంభించనుంది. మ్యాచ్‌ల మధ్య ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఉండాలని వివిధ దేశాలకు చెందిన క్రికెట్ జట్లు కోరడంతో ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది.

అలాగే టోర్నీ వేదికలను కూడా ఆటగాళ్లు అలసిపోని విధంగా ఐసీసీ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. జొహన్నెస్‌బర్గ్ (వాండరర్స్), ప్రిటోరియా (సెంచూరియన్)లలో టోర్నీ మొత్తం మ్యాచ్‌లను నిర్వహిస్తారు.

జంట నగరాలుగా పిలువబడే ఈ సిటీల మధ్య దూరం చాలా తక్కువగా ఉండటంతో.. ఆటగాళ్లు పెద్దగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఐసీసీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

Share this Story:

Follow Webdunia telugu