Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆధిక్యం

కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆధిక్యం
స్వదేశంలో పటిష్టమైన దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు తన ఆధిక్యాన్ని కనపరుస్తోంది. ఆదివారం జరిగిన నాలుగో వన్డేలోనూ ఇంగ్లాండ్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 4-0 ఆధిక్యంతో ముందుకు దూసుకెళుతోంది.

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఇరుజట్ల మధ్య నాలుగో వన్డే ఆదివారం జరిగింది. వరుణుడు అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 32.1 ఓవర్స్‌కు కుదించారు. నిర్ణీత యాభై ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు గిబ్స్ (74), ఆమ్లా (34)లు రాణించి, తొలి వికెట్‌కు 66 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేదు.

ఆ తర్వాత 184 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌కు వరుణుడు మరోమారు అడ్డుతగిలాడు. దీంతో డక్‌వర్త్ లూయీస్ పద్దతి ప్రకారం ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని 20 ఓవర్లలో 137 పరుగులుగా నిర్ణయించారు.

ఓఏషా (44) కెప్టెన్ పీటర్సన్ (40), ఫ్లింటాఫ్‌ (31) రాణించడంతో మరో 14 బంతులు మిగిలి వుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించినందుకు గాను ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

Share this Story:

Follow Webdunia telugu