కెప్టెన్లుగా అభిషేక్ నాయర్, ఉన్ముక్త్ చాంద్: కివీస్ టూర్కు సన్నద్ధం
న్యూజిలాండ్ ‘ఎ’తో జరిగే మూడు, నాలుగు రోజుల మ్యాచ్ల్లో పాల్గొనే భారత్ ‘ఎ’ జట్టుకు ముంబయి సంచలన బ్యాట్స్మన్ అభిషేక్ నాయర్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. అదే విధంగా మూడు పరిమిత ఓవర్ల మ్యాచ్ల్లో ఆడే భారత్ ‘ఎ’కు ఢిల్లీ యువ బ్యాట్స్మన్ ఉన్ముక్త్ చాంద్ నాయకత్వం వహిస్తాడు. మూడు, నాలుగు రోజుల మ్యాచ్ల్లో ఆడే జట్టులోనూ ఉన్ముక్త్కు స్థానం లభించింది. సందీప్ పాటిల్ అధ్యక్షతన బుధవారం ఇక్కడ సమావేశమైన భారత జాతీయ సెలక్షన్ కమిటీ రెండు జట్లను ఎంపిక చేసింది. ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకూ మూడు రోజుల మ్యాచ్ విశాఖపట్నంలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకూ నాలుగు రోజుల మ్యాచ్ జరుగుతుంది. సెప్టంబర్ 11, 13, 15 తేదీల్లో పరిమిత ఓవర్ల మ్యాచ్లు ఉంటాయి.