Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కివీస్ పర్యటనకు అండర్-19 భారత జట్టు ఎంపిక

కివీస్ పర్యటనకు అండర్-19 భారత జట్టు ఎంపిక
, సోమవారం, 7 డిశెంబరు 2009 (09:54 IST)
వచ్చే యేడాది ఆరంభంలో న్యూజిలాండ్‌లో పర్యటించనున్న అండర్-19 భారత జట్టును సెలక్టర్లు ఆదివారం ఎంపిక చేశారు. ఈ జట్టుకు రాజస్థాన్‌కు చెందిన అశోక్ మానేరియా నాయకత్వం వహిస్తాడు. జనవరి 16వ తేదీ నుంచి న్యూజిలాండ్‌లో అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ జరుగనుంది. దీనికి 15 మంది సభ్యులతో కూడిన జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఎంపిక చేసింది.

కాగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇండియా తమ తొలి మ్యాచ్‌ను జనవరి 15న ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది. రెండు రోజుల అనంతరం క్రైస్ట్‌ చర్చ్‌లో హాంకాంగ్‌తో ఆడుతుంది. గ్రూప్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ను జనవరి 21వ తేదీన ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ప్రతి గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకున్న రెండు జట్లు క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరుకుంటాయి.

భారత జట్టు వివరాలు.. అశోక్‌ మానేరియా (కెప్టెన్‌), మాన్‌దీప్‌ సింగ్‌, మాయంక్‌ అగర్వాల్‌, అక్షత్‌ రెడ్డి, హర్‌ప్రీత్‌ సింగ్‌, కె.ఎల్‌.రాహుల్‌, సుఫియాన్‌ షేక్‌, జాహిద్‌ ఆలీ, హర్ష్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్‌కాడ్‌, సందీప్‌ శర్మ, సౌరవ్‌ నేత్రవాల్కర్‌, హర్మీత్‌ సింగ్‌, మానన్‌ శర్మ, గౌరవ్‌ జాతాలు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu