Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్‌పై చిదంబరంతో బీసీసీఐ భేటీ

Webdunia
కేంద్ర హోంశాఖా మంత్రి పి. చిదంబరంతో భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) బుధవారం సమావేశం కానుంది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మ్యాచ్‌ల భద్రతకు సంబంధించి ఈ సమావేశంలో సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

మంగళవారం లాహోర్‌లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఏప్రిల్‌లో భారత్‌లో జరగనున్న రెండోదఫా ఐపీఎల్‌ టోర్నీలో నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండటం వల్ల, ఐపీఎల్ మ్యాచ్‌లకు పూర్తి స్థాయి భద్రత కల్పించలేమని కేంద్ర హోం మంత్రి చిదంబరం ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే.

ఈ మేరకు ఎన్నికల తర్వాతనే ఐపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిండం మంచిదని చిదంబరం బీసీసీఐని కోరారు. అయితే దీనిపై స్పందించిన బీసీసీఐ ఎన్నికల సమయంలో మ్యాచ్‌లు లేకుండా చూసి... రీ షెడ్యూల్‌ను విడుదల చేస్తామని తెలిపింది. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునేందుకు హోంమంత్రితో బీసీసీఐ ఈరోజు భేటీ కానుంది.

ఇదిలా ఉంటే... లంక క్రికెటర్ల దాడితో సంబంధం ఉన్న పదిమంది అనుమానితులను పాకిస్థాన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిలో నలుగురిని ఆప్ఘనిస్థాన్ పౌరులుగా గుర్తించారు. కాగా, ఈ దాడి ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించిన సమాచారం ఇచ్చినవారికి పాక్ ప్రభుత్వం కోటి రూపాయల నజరానాను ప్రకటించడం గమనార్హం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Show comments