Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ రెండు జట్లకే విజయావకాశాలు: మైకీ ఆర్థర్

ఈ రెండు జట్లకే విజయావకాశాలు: మైకీ ఆర్థర్
ఇంగ్లండ్‌ గడ్డపై జరుగుతున్న ట్వంటీ-20 ప్రపంచ కప్ టోర్నీని కైవసం చేసుకునే అవకాశాలు డిఫెండింగ్ ఛాంపియన్ భారత్, దక్షిణాఫ్రికా జట్లకు మాత్రమే ఉన్నట్టు సఫారీల కోచ్ మైకీ ఆర్థర్ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను శాసించే సత్తా కలిగిన ఆటగాళ్లు ఇరు జట్లలో ఎంతోమంది ఉన్నారన్నాడు. అందువల్ల వీటికే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు చెప్పుకొచ్చాడు.

సూపర్-8కు చేరుకున్న ఎనిమిది జట్లలో ఒంటి చేత్తో గెలిపించే సత్తా కలిగిన ఆటగాళ్లు ఒకరిద్దరు మాత్రమే ఉన్నాడు. అయితే, మ్యాచ్‌లో విజయం సాధించాలంటే ఒకరి కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు రాణించాలి. ఐదు లేదా ఆరు మ్యాచ్‌లను ఒకే ఆటగాడు గెలిపించలేడు కదా ఆర్థర్ ప్రశ్నించాడు.

ప్రస్తుతం మ్యాచ్‌ను శాసించే ఆటగాళ్లను నాలుగు జట్లు మాత్రమే ముగ్గురు లేదా నలుగురిని కలిగివున్నాయి. అయితే, భారత్, దక్షిణాఫ్రికా జట్లలో మాత్రమే ఆ తరహా ఆటగాళ్లు ఏడు లేదా ఎనిమిది మంది ఉన్నట్టు ఆయన గుర్తు చేశాడు.

తమ జట్టు విషయానికే వస్తే గ్రిబ్స్, స్మిత్, కల్లీస్‌లు ఉన్నాడు. వీరు విఫలమైనా డీ విలియర్స్, డుమ్నీ, మోర్కెల్, బౌచర్, స్టైన్, బొయిథా, పర్నేల్ వంటి ఆటగాళ్లు ఉన్నారన్నారు. అలాగే, భారత జట్టులోనూ ఇదే తరహా ఆటగాళ్లు ఉన్నట్టు ఆర్థర్ గుర్తు చేశాడు. అందువల్ల కప్‌ను కైవసం చేసుకునేందుకు ఇరు జట్లకే ఉందన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu