Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్

ఐసీసీ కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ కెప్టెన్ జహీర్ అబ్బాస్
, గురువారం, 25 జూన్ 2015 (16:56 IST)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జహీర్ అబ్బాస్ ఎంపికయ్యారు. బార్బాడోస్‌లో జరిగిన వార్షిక సదస్సులో భాగంగా అబ్బాస్‌ను ఎన్నుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. వెంటనే అబ్బాస్ ఏడాది పాటు సేవలందించేలా బాధ్యతలు స్వీకరించారు. 
 
ఈ సందర్భంగా జహీర్ అబ్బాస్ ప్రసంగిస్తూ.. అద్భుత క్రీడ క్రికెట్ నియంత్రణా మండలికి అధ్యక్ష బాధ్యతలు లభించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. క్రికెట్ వివిధ దేశాల మధ్య స్నేహ సంబంధాలను, గౌరవాన్ని పెంచుతుందన్నారు. 
 
ఐసీసీ పగ్గాలను చేపట్టడం ద్వారా పలు దేశాలకు సేవచేసే అవకాశం లభించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. తనపై గల నమ్మకంతో ఐసీసీ చీఫ్ పోస్టుకు తన పేరును సిఫార్సు చేసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఈ సందర్భంగా అబ్బాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ సమావేశానికి హాజరైన తాజా మాజీ చైర్మన్, బీసీసీఐ బోర్డు సభ్యుడు ఎన్.శ్రీనివాసన్ స్వయంగా జహీర్‌ అబ్బాస్‌ను ఆహ్వానించారు. ఆయన గొప్ప క్రికెటరని అభివర్ణించారు.

Share this Story:

Follow Webdunia telugu