Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వన్డే వరల్డ్ కప్: భారత్‌తో యూఏఈ మ్యాచ్.. తొలి వికెట్ డౌన్!

వన్డే వరల్డ్ కప్: భారత్‌తో యూఏఈ మ్యాచ్.. తొలి వికెట్ డౌన్!
, శనివారం, 28 ఫిబ్రవరి 2015 (12:40 IST)
వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా పెర్త్ వేదికగా శనివారం భారత్‌-యూఏఈ జట్లు తలపడుతున్నాయి. యూఏఈ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. యుఏఈ బ్యాటింగ్ ఆరంభంలోనే తడబడింది.

భారత బౌలర్ భువనేశ్వర్ బౌలింగ్‌లో యుఏఈ ఓపెనర్ బెరెంజర్‌ ధోనీకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. అమ్జద్ అలీ 2, కృష్ణ చంద్రన్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. 
 
తాజా ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడగా, భారత్‌ ఆడిన రెండింటిలో విజయం సాధించింది. యూఏఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పరాజయాన్ని చవిచూసింది. రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న ఇండియా తాజా మ్యాచ్‌లో యూఏఈపై కూడా గెలిచి హ్యట్రిక్ గెలుపును నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.

Share this Story:

Follow Webdunia telugu