Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. సిడ్నీలో తగ్గని వర్షం!

భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు వరుణ గండం.. సిడ్నీలో తగ్గని వర్షం!
, బుధవారం, 25 మార్చి 2015 (10:02 IST)
ప్రపంచ కప్ క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం జరుగనున్న భారత్, ఆస్ట్రేలియా రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు వరుణ గండం పొంచివుంది. గత రాత్రి నుంచి సిడ్నీ నగరాన్ని ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. 
 
ఈ పోరు తీవ్రంగా ఉంటుందని, తమ సర్వశక్తులూ ఒడ్డేందుకు ఇరు జట్ల ఆటగాళ్లు రెడీ అవుతున్నారని, పరుగుల వరద ఖాయమని అభిమానులు భావిస్తున్న తరుణంలో, వరుణుడు అడ్డు తగలవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కూడా వర్షం పడుతుందని, గురువారం ఉదయానికి కొంత పొడి వాతావరణం కనిపిస్తుందని తెలిపింది. కాగా, ఈ వర్షం పిచ్ పై చూపే ప్రభావం ఈ జట్టుకు అనుకూలంగా మారుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu