Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతూ అనుష్కతో మాట్లాడిన కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్..!

డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళుతూ అనుష్కతో మాట్లాడిన కోహ్లీ.. బీసీసీఐ వార్నింగ్..!
, మంగళవారం, 19 మే 2015 (11:10 IST)
మ్యాచ్ సందర్భంగా తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతో మాట్లాడిన బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని బీసీసీఐ మందలించింది. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూంలోకి వెళుతున్న కోహ్లీని అనుష్క శర్మ ఆపేసింది. కోహ్లీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని కంగ్రాట్స్ చెప్పింది. దీనికి కోహ్లీ కూడా నవ్వుతూ ఆసక్తిగా అనుష్కతో ఏదో చెప్పాడు. ఈ దృశ్యం చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.
 
అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం మ్యాచ్ జరుగుతుండగా, జట్టు సభ్యులు, ప్రత్యర్థి జట్టు సభ్యులు మినహా బయటి వ్యక్తులతో మాట్లాడేందుకు ఆటగాళ్లకు అనుమతి లేదట. కోహ్లీ, అనుష్కతో మాట్లాడడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. చిన్నస్వామి స్టేడియంలో వీఐపీ ఎన్ క్లోజర్, ఆటగాళ్ల డగౌట్ దగ్గరగా ఉండటం వల్లే అనుష్కతో కోహ్లీ మాట్లాడగలిగాడు. విషయం తెలిసిన తర్వాత విరాట్‌ను పిలిచి అనధికారికంగా వార్నింగిచ్చాను అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు. సో ఈ లౌలీ ప్రేమ జంట కాస్త స్పీడు తగ్గించాలన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu