Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు... ఎందుకు?

మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ దంపతులపై ఎఫ్ఐఆర్ నమోదు... ఎందుకు?
, ఆదివారం, 30 ఆగస్టు 2015 (14:43 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై ముంబైలో ఎఫ్ఐఆర్ నమోదైంది. తన ఇంట్లో పని చేసే పనిమనిషిపై చేయి చేసుకోవడమే ఇందుకు కారణంగా ఉంది. కాంబ్లీ ఇంట పని చేసేందుకు సోనీ సరళ్ అనే మహిళ పని చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ప్రతి నెలా రూ.10 వేలు చెల్లించేలా వారి మధ్య అగ్రిమెంట్ కుదిరింది. అయితే, వారు మాట నిలబెట్టుకోలేదని, ఎప్పుడో ఒకసారి జీతం ఇచ్చేవారని ఆరోపించింది. 
 
ఇటీవల వారి తీరు మరీ అధ్వానంగా తయారైందని, జీతం ఇవ్వకపోగా, తనను ఇంటికి కూడా వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, తనపై దాడి చేశారని పేర్కొంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వినోద్ కాంబ్లీ, అతని భార్య ఆండ్రియాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ముంబై బాంద్రా పోలీసులు వెల్లడించారు. 
 
కాగా, ఈ ఫిర్యాదుపై మీడియా కాంబ్లీ దంపతులను స్పందన కోరే ప్రయత్నం చేయగా, వారు అందుబాటులోకి రాలేదు. సరళ్ ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసు విభాగం ప్రతినిధి డీసీపీ ధనంజయ్ కులకర్ణి తెలిపారు. కాంబ్లీ దంపతులను పిలిపించి వారి స్టేట్మెంట్ రికార్డు చేస్తామని బాంద్రా పోలీసు అధికారి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu