Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా, ప్రపంచకప్‌లకు టీమిండియా ఎంపిక: కెప్టెన్ కూల్ ధోనీనే సారథి!

ఆసియా, ప్రపంచకప్‌లకు టీమిండియా ఎంపిక: కెప్టెన్ కూల్ ధోనీనే సారథి!
, శుక్రవారం, 5 ఫిబ్రవరి 2016 (14:25 IST)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ఆసియా కప్, ఐసీసీ ప్రపంచ కప్ టోర్నమెంట్‌‌లలో ఆడే 15 సభ్యులతో కూడిన  భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో పవన్ నేగి, బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీకి స్థానం దక్కింది. ఇక ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లలో ఆడే టీమిండియా జట్లకు కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే నాయకత్వం వహించనున్నాడు.
 
ఈ రెండు క్రికెట్ సిరీస్‌లకు ధోనీనే కెప్టెన్సీ వహించనున్నట్లు చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. రెండు సిరీస్‌లకు ఒకే జట్టును సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రారంభం కానుండగా, ఆసియా కప్ ఫిబ్రవరి 24 నుంచి మార్చి 6వ తేదీ వరకు జరుగనున్నాయి. 
 
జట్టు వివరాలు: మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, యువరాజ్ సింగ్, అజింక్యా రెహానే, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, పవన్ నేగి, హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా, మొహ్మద్ షమీ, బుమ్రా, పాండ్యా. 

Share this Story:

Follow Webdunia telugu