Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్

నిషేధంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించిన చెన్నై సూపర్ కింగ్స్
, శుక్రవారం, 21 ఆగస్టు 2015 (09:56 IST)
బీసీసీఐ నిర్ణయంపై జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు, బీసీసీఐ నిర్ణయంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయ్యింది. ఫిక్సింగ్ ఆరోపణలతో ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ రెండేళ్ల పాటు నిషేధం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.  
 
ఇంకా క్రికెట్‌ ప్రపంచంలో కలకలం రేపిన ఐపిఎల్ స్ఫాట్ ఫిక్సింగ్ కేసులో మాజీ సిజెఐ జస్టిస్ లోథా నేతృత్వంలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు త్రిసభ్య కమిటీ సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై ఈ కమిటీ రెండేళ్ల నిషేధం విధించింది. 
 
చెన్నై సూపర్ కింగ్స్ యజమాని శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహభాగస్వామి రాజ్ కుంద్రాలపై జీవితకాల నిషేధం పెట్టింది. కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా ఎటువంటి టోర్నీలలోనూ వీరి ప్రమేయం ఉండకూడదని కమిటీ పేర్కొంది. 
 
అంతేగాకుండా ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో యాజమాన్యం పాత్రపై నిజాలు నిగ్గుతేలడంతో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై రెండేళ్లు నిషేధం విధిస్తూ జిస్టిస్ లోథా కమిటీ సిఫారసు చేసింది. ఆ సిఫారసును బీసీసీఐ అమలు చేసింది. దీంతో భారీ నష్టాన్ని ఎలా భర్తీ చేసుకోవాలో అర్థం కాక, చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.

Share this Story:

Follow Webdunia telugu