Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ

దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య క్రికెట్ సిరీస్: షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
, సోమవారం, 27 జులై 2015 (19:32 IST)
దక్షిణాఫ్రికా-భారత్‌ల మధ్య జరుగనున్న క్రికెట్ సిరీస్ షెడ్యూల్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌లో రెండు జట్లు నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఆడనున్నాయని బీసీసీఐ తెలిపింది. తొలి టెస్టు నవంబర్ 5న మొహాలీలో ప్రారంభం కానుండగా 9న ముగియనుంది. రెండో టెస్టు నవంబర్ 14 నుంచి 18వ తేదీ వరకు బెంగళూరులో జరుగనుంది. 
 
మూడో టెస్టు నవంబర్ 25 నుంచి 29 వరకు నాగ్ పూర్‌లో ఆడనున్నారు. నాలుగో టెస్టును ఢిల్లీలో డిసెంబర్ 3 నుంచి 7 వరకు జరగనుంది. నాలుగేళ్ల విరామం తరువాత సఫారీ జట్టు భారత్‌లో సిరీస్ ఆడనుండడం విశేషం. కాగా, సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా జట్టును ప్రకటించనున్నారు.
 
ఇకపోతే ట్వంటీ-20 సిరీస్ అక్టోబర్ రెండో తేదీ ధర్మశాలలో, అక్టోబర్ ఐదో తేదీన రెండో టీ-20 కటక్‌లోనూ, అక్టోబర్ 8వ తేదీన కోల్ కతా మూడో ట్వంటీ-20 జరుగుతుంది. అలాగే వన్డే సిరీస్ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 25 వరకు జరుగనుంది. తొలి వన్డే కాన్పూర్, రెండో వన్డే ఇండోర్, మూడో వన్డే రాజ్ కోట్, నాలుగో వన్డే చెన్నై, ఐదో వన్డే ముంబై వేదికలుగా జరుగనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu