Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లండన్‌లో లలిత్ మోడీని కలవలేదు.. అవన్నీ పుకార్లే: షారూఖ్ ఖాన్

లండన్‌లో లలిత్ మోడీని కలవలేదు.. అవన్నీ పుకార్లే: షారూఖ్ ఖాన్
, మంగళవారం, 30 జూన్ 2015 (11:52 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీని లండన్‌లో కలిశానని వచ్చిన వార్తలను బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఖండించారు. కోల్ కతా నైట్ రైడర్స్‌కు తాను ఓనర్ని మాత్రమేనని.. లలిత్ మోడీతో సంబంధం ఛైర్మన్‌గా సమయంలోనేనని షారూఖ్ స్పష్టం చేశారు. షూటింగ్ కోసం లండన్ వెళ్లానని చెప్పారు. తనకు లండన్‌లో సమయమే లేదని, లలిత్ మోడీని కలవలేదని చెప్పిన ఆయన, తాను కలిసుంటే, ఈ పాటికి మోడీ అందరికీ చెప్పి వుండేవాడని షారూఖ్ వ్యాఖ్యానించారు. 
 
తనపై ఆరోపణలు వచ్చిన రోజు తాను లండన్‌‍లో లేనని బల్గేరియాలో ఉన్నానని.. అంతకుముందు రోజు రాత్రి 6 గంటల వరకు కబుర్లు చెప్పుకుంటూ యూనిట్‌తో గడిపానని.. ఆ తర్వాత విమానాశ్రయానికి వచ్చి రెండు గంటల సమయంలో విమానం ఎక్కి తదుపరి రోజు సాయంత్రం ఆరింటికి దిగామన్నారు. ఆ తర్వాత తన కుమార్తె, కుమారుడు స్కూల్ అడ్మిషన్ పనుల్లో బిజీ బిజీ అయ్యానని ఖాన్ చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu