Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్-దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్: క్రికెట్ ఫ్యాన్స్‌కు పసందైన విందు

భారత్-దక్షిణాఫ్రికా తొలి మ్యాచ్: క్రికెట్ ఫ్యాన్స్‌కు పసందైన విందు
, గురువారం, 1 అక్టోబరు 2015 (16:49 IST)
అంతర్జాతీయ అత్యుత్తమ జట్లైన టీమిండియా-దక్షిణాఫ్రికాల మధ్య తొలి మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పసందైన విందునివ్వనుంది. వన్డే, టెస్టు, ట్వంటీ-20 పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న సుదీర్ఘ సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 2న ధర్మాశాల వేదికగా జరుగనుంది. ప్రస్తుతం ఇరు జట్లు ముమ్మర ప్రాక్టీస్‌లో మునిగిపోయాయి. 
 
టీమిండియా టాపార్డర్‌ను కట్టడి చేసేందుకు స్టెయిన్, మోర్కెల్, అబోట్, తాహిర్ ప్రణాళికలు సిద్ధం చేస్తుండగా, వారిని ఎదుర్కొనేందుకు ధావన్, కోహ్లీ, ధోనీ, రహానే, రోహిత్, రైనా, రాయుడు సిద్ధంగా ఉన్నారు. మరోవైపు మిల్లర్, ఆమ్లా, డుప్లెసిస్, డికాక్, డివిలీర్స్, డుమిని లను ఎదుర్కొనేందుకు భువీ, మోహిత్, బిన్నీ, అశ్విన్, హర్భజన, అక్షర్ పటేల్, మిశ్రా సిద్ధంగా ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరగనున్న తొలి మ్యాచ్‌లో ఇరు జట్లకు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని క్రీడా పండితులు అంటున్నారు. ఇరు జట్ల మధ్య నువ్వా నేనా అనే విధంగా మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu