Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్'... అభినందనల వెల్లువ.. మోడీ ట్వీట్స్..!

డబుల్స్‌లో సానియా 'నెంబర్ వన్'... అభినందనల వెల్లువ.. మోడీ ట్వీట్స్..!
, సోమవారం, 13 ఏప్రియల్ 2015 (12:55 IST)
ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నెంబర్ వన్ ర్యాంకు సాధించిన సానియా మిర్జాకు అభినందనలు వెల్లువెత్తాయి. పలువురు ప్రముఖులు సానియాను అభినందిస్తున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సానియా మిర్జాను అభినందించారు. ట్విట్టర్‌లో ఆయన తన అభినందనలను నమోదు చేశారు.
 
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మహిళల డబుల్స్‌లో నెంబర్ వన్ ర్యాంకును సాధించింది. ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా సానియా రికార్డుల్లోకెక్కింది. ప్రముఖ టెన్నిస్ స్టార్ మార్టినా హింగిస్‌తో కలసి ఫ్యామిలీ సర్కిల్  కప్ టైటిల్ సొంతం చేసుకుంది. 
 
వరల్డ్ రికార్డు సృష్టించిన సానియా యువతరానికి ఆదర్శం అని తెలంగాణ సీఎం కేసీఆర్ కొనియాడారు. అదే విధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనందిబెన్ పటేల్, దేబేంద్ర ఫడ్నవీస్, మమతాబెనర్జీ, సినీ ప్రముఖులు నాగార్జున, రవీనాటాండన్ సోనూసూద్, సుశాంత్, ఫరాన్ అక్తర్, ఫరాఖాన్, క్రీడాకారులు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, సచిన్, లియాండర్ పేస్, రాజకీయ ప్రముఖులు కేటీఆర్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు మరికొందరు ప్రముఖులు సానియాకు అభినందనలు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu